ముగిసిన SLBC హెలీ బోర్న్ సర్వే.. నల్లమల అడవిలో 44 కిలోమీటర్ల పనుల పురోగతి

ముగిసిన SLBC  హెలీ బోర్న్ సర్వే.. నల్లమల అడవిలో 44 కిలోమీటర్ల పనుల పురోగతి

నాగర్​కర్నూల్, వెలుగు: శ్రీశైలం ఎడమగట్టు కెనాల్​(ఎస్​ఎల్​బీసీ) పనుల పురోగతి కోసం ఎన్​జీఆర్​ఐ సైంటిస్టులు మన్నెవారిపల్లె నుంచి చేపట్టిన ఎయిర్​ బోర్న్​ మ్యాగ్నిటిక్​ సర్వే శనివారం పూర్తయింది. దోమలపెంటలోని ఇన్​లెట్​ నుంచి మన్నెవారిపల్లె ఔట్​లెట్​ వరకు నల్లమల అడవిలో 44 కిలోమీటర్ల పొడవున్న ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ తవ్వాల్సిన ప్రదేశానికి ఇరువైపులా 3 కిలోమీటర్ల వెడల్పులో సర్వే నిర్వహించారు. సర్వేలో సేకరించిన వివరాలను15 రోజుల్లో విశ్లేషించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిస్తామని ఎన్​జీఆర్​ఐ చీఫ్​ సైంటిస్ట్​ డాక్టర్​ సత్యనారాయణ వెల్లడించారు. అనేక సవాళ్ల మధ్య సర్వేను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.