నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో మాతాశిశు మరణాల ఉదంతాలపై లోతుగా విచారణ జరుపుతామని, డాక్టర్లు నిర్లక్ష్యం చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన మాతాశిశు మరణాల నిరోధక కమిటీ మీటింగ్లో ఆయన మాట్లాడారు.
మూడు నెలలుగా జిల్లాలో నమోదైన మాతాశిశు మరణాల కేసులను తెలుసుకున్నారు. మహిళలు గర్భం దాల్చాక క్రమంగా వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్లను రెగ్యులర్గా తనిఖీ చేయాలని, లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించే సెంటర్లను సీజ్ చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్వో రవీందర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత, బుస్స ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల తనిఖీ..
ఎడపల్లి/నవీపేట్, వెలుగు: ఎడపల్లి మండలం జానకంపేట, నవీపేట్ మండలంలోని అభంగపట్నంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని, ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఎన్నిక నిర్వహించాలని సూచించారు.
