నిజామాబాద్​లో పిచ్చికుక్క స్వైర విహారం.. పదిమందికి గాయాలు

నిజామాబాద్​లో పిచ్చికుక్క స్వైర విహారం.. పదిమందికి గాయాలు
  •     నాలుగేండ్ల బాలుడి పరిస్థితి విషమం

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​లోని గాయత్రీనగర్​లో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించినవారిని కరవడంతో పది మంది గాయపడ్డారు. ఇందులో నాలుగేండ్ల పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది. గాయత్రీనగర్​లో  ఉదయం 8 గంటలకు గేట్ ​బయటకు వచ్చిన సృజన్​పై కుక్క దాడి చేసింది. అతడి చెవి వెనుక భాగాన్ని చీల్చేసింది.

గమనించిన చుట్టుపక్కల వాళ్లు దాన్ని తరమడానికి ప్రయత్నించగా స్రవంతి, శ్రీకాంత్​లను కొరికింది. ఇదే క్రమంలో మరో ఏడుగురిపై కూడా దాడి చేసి గాయపరిచింది. బాధితులు గవర్నమెంట్​హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​తీసుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు సృజన్​ను అతడి తల్లిదండ్రులు హైదరాబాద్ ​తరలించారు.