నోబెల్ ​బహుమతికి రూ.800 కోట్లు

 నోబెల్ ​బహుమతికి రూ.800 కోట్లు

ఉక్రెయిన్​ చిన్నారుల కోసం వేలం వేసిన రష్యా జర్నలిస్టు దిమిత్రి

న్యూయార్క్: రష్యా–ఉక్రెయిన్ ​యుద్ధం కారణంగా లక్షలాది మంది ఉక్రెనియన్​లు వలసెళ్లిపోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. వారు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా చూసిన రష్యా జర్నలిస్ట్ దిమిత్రి మురతోవ్​సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021 ఏడాదికిగాను తనకిచ్చిన నోబెల్​ శాంతి బహుమతిని వేలం వేశారు. రికార్డు స్థాయిలో 103.50 మిలియన్​ డాలర్లు(దాదాపుగా రూ.809 కోట్లు) వచ్చాయి. వీటిని శరణార్థులుగా మారిన ఉక్రెయిన్​ చిన్నారుల కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. యూనిసెఫ్​ ఆధ్వర్యంలో సాయం చేస్తానని మురతోవ్​ చెప్పారు. ఇంత భారీ మొత్తం నిధులు వస్తాయని అస్సలు ఊహించలేదని మురతోవ్ ​తెలిపారు.