వంశీకృష్ణ గెలిపిస్తే మరింత అభివృద్ధి ​: నోముల ఉపేందర్​గౌడ్

వంశీకృష్ణ గెలిపిస్తే మరింత అభివృద్ధి ​: నోముల ఉపేందర్​గౌడ్

కోల్​బెల్ట్​,వెలుగు:పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, యువతకు భవిష్యత్​ ఉంటుందని మందమర్రి పట్టణ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ నోముల ఉపేందర్​గౌడ్​ అన్నారు. మంగళవారం మందమర్రిలో కాంగ్రెస్​ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్​ లీడర్​ సొతుకు సుదర్శన్​, పార్టీ మండల ప్రెసిడెంట్​ నీలయ్య, జిల్లా జనరల్​ సెక్రటరీ మండ భాస్కర్​తో కలిసి మాట్లాడారు. కాకా వెంకటస్వామి కుటుంబం 60ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. 

కాకా, ఆయన కుమారులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్​ వెంకటస్వామి బాటలో మనవడు గడ్డం వంశీకృష్ణ ప్రజాసేవ చేసేందుకు రాజకీయల్లోకి రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. యువకుడు, విద్యావంతుడు, పారిశ్రామివేత్త వంశీని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, పెద్దపల్లి   లో  ఇండస్ర్టీయల్​ కారిడార్​ ఏర్పాటుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. వంశీని బంపర్​ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 

ఈ సమావేశంలో బ్లాక్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ గందె రాంచందర్​, జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మన్​, డీసీసీ మెంబర్​ బత్తుల రమేశ్​, కడారి జీవన్​కుమార్​,  ఎస్సీ, మైనార్టీ మహిళ కాంగ్రెస్​ అధ్యక్షుడు  నెరువెట్ల శ్రీనివాస్​, ఎండి.జమీల్​, గడ్డం రజని, సేవాదళ జిల్లా ప్రెసిడెంట్​ ఎండి.ఆఫీజ్​ తదితరులు పాల్గొన్నారు.