పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ

పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ

లింగంపేట, వెలుగు : నాలుగేండ్లుగా బకాయిపడిన గ్రంథాలయ పన్నులు చెల్లించాలని కోరుతూ లింగంపేట శాఖ గ్రంథాలయ లైబ్రేరియన్​ శ్రీనివాస్​పలువురు సర్పంచులకు శనివారం నోటీసులు జారీ చేశారు. మండలంలోని 41 జీపీలలో 2019 నుంచి  2023 వరకు రూ. 8 లక్షల పన్ను బకాయిలు ఉన్నట్లు ఆయన చెప్పారు. లైబ్రరీ పన్నులను సకాలంలో చెల్లించని కారణంగా గ్రంథాలయాల నిర్వహణ కష్టంగా మారిందని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. డిసెంబర్​నెలాఖరులోగా పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.