కరోనాను తరిమికొట్టేందుకు నరబలిచ్చిన అర్చకుడు

కరోనాను తరిమికొట్టేందుకు నరబలిచ్చిన అర్చకుడు

కరోనాను వైరస్ ను అరికట్టేందుకు పలు దేశాల సైంటిస్టులు వ్యాక్సిన్  కనుగొనేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు కొందరు మూఢనమ్మకాలతో ప్రజలను  భయపెడుతున్నారు. కరోనా వ్యాప్తితో జనం వణికిపోతుంటే..మరోవైపు ఓ పూజారి నరబలితో మరింత భయాందోళనకు గురి చేశాడు. ఈ దారుణమైన ఘటన ఒడిశాలోని కటక్ లో జరిగింది.

ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా పోవాలని కోరుతూ ఓ అలయ అర్చకుడు నరబలి ఇచ్చాడు. బ్రాహ్మణిదేవి ఆలయంలో సంసారీ ఓజా అర్చకుడు. కరోనాను అరికట్టాలని అనుకున్నాడు. దీనికి నరబలి ఇవ్వాలని అనుకున్నాడు. ఆ ఆలయంలోని అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడిని నరికాడు. విషయం తెలుకున్న పోలీసులు అర్చకుడి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలనే నరబలికి పాల్పడ్డట్లు అర్చకుడు తెలిపాడు. నరబలి విషయం బయటకు తెలియగానే జనం తీవ్ర భయానికి లోనయ్యారు.