ఇంటికి కరెంట్ బిల్లు రూ.2,72,151.. పొరపాటుగా వచ్చిందంటున్న ఆఫీసర్లు

 ఇంటికి కరెంట్ బిల్లు రూ.2,72,151..  పొరపాటుగా వచ్చిందంటున్న ఆఫీసర్లు

హుజూర్ నగర్, వెలుగు:  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఓ విద్యుత్ వినియోగదారుడు కరెంటు బిల్లు చూసి షాక్ అయ్యాడు. సాయి ప్రభాత్​ నగర్ కాలనీకి చెందిన గజ్జి ప్రభాకర్ 2017 లో తన ఇంటిపై రూఫ్​ టాప్ సోలార్ పవర్  ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు.  సోలార్ పవర్ నుంచి వచ్చిన కరెంట్​ను తన ఇంటి అవసరాలకు పోగా మిగిలింది నెట్ మీటర్ ద్వారా గ్రిడ్ కు అటాచ్​ చేసి అమ్ముకుంటున్నారు.  ఈ కరెంట్​కు మొన్నటి మార్చి వరకు రూ. 18 వేలు విద్యుత్​ శాఖ ప్రభాకర్​ కు బకాయి పడింది.

కాగా ఏప్రిల్ లో విద్యుత్​ సిబ్బంది ప్రభాకర్​ ఇంటి మీటర్​ రీడింగ్ నమోదు చేసి రూ. 2 .72 లక్షలు  బకాయి ఉన్నట్లు బిల్ జనరేట్  చేసి అందించారు.  దీంతో ఆయన ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కరించకపోగా  కనెక్షన్​ తొలగించడానికి నోటీసు ఇచ్చారు.  ఇదే విషయమై విద్యుత్  ఏఈ రాంప్రసాద్ వివరణ కోరగా.. గతంలో రీడింగులు నమోదు చేసేటప్పుడు సాంకేతికంగా జరిగిన పొరపాట్ల వల్ల  తప్పుగా బిల్లు వచ్చిందన్నారు.  టెక్నికల్ టీంతో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.