
ధర్మసాగర్/ రాయపర్తి/ గూడూరు/ కొత్తగూడ, వెలుగు: యూరియా సరఫరాలు రైతులకు ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులు అన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో సొసైటీలను అధికారులు సందర్శించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువులు, యూరియా గోదామ్, మన గ్రోమోర్ కేంద్రాన్ని కలెక్టర్ స్నేహశబరీశ్తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి పీఏసీఎస్, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం మండలంలోని పెర్కవేడు, రాయపర్తి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ నిర్వహించారు.
నేరుగా లబ్ధిదారుల అర్హతలు పరిశీలించారు. రాయపర్తి సంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో కిషోర ఆరోగ్య రక్ష శిబిరాన్ని పరిశీలించారు. మహబూబాబాద్ గూడూరు సొసైటీ యూరియా గోదాంను ఎస్పీ రాంనాథ్కేకన్ తహసీల్దార్ నాగభవానీతో కలిసి సందర్శించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్ను మండల స్పెషల్ ఆఫీసర్ సురేశ్ టాస్క్ ఫోర్స్ బృందంతో తనిఖీ చేశారు. అనంతరం రైతు వేదికలో మండల టాస్క్ఫోర్స్ఆఫీసర్లు, డీలర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ఆదేశించారు.