క్షుద్రపూజలు చేస్తున్నాడని నిప్పులపై డ్యాన్స్ చేయించారు

క్షుద్రపూజలు చేస్తున్నాడని నిప్పులపై డ్యాన్స్ చేయించారు

ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోయి, సైన్స్ ఎన్నో వింతలు క్రియేట్ చేస్తున్నా అక్కడక్కడ మూడనమ్మకాలు జనాలను ఏలుతున్నాయి. 75ఏళ్ల ఓ వృద్ధుడు తాంత్రిక పూజలు చేస్తున్నాడనే నెపంతో గ్రామస్థులు బలవంతంగా నిప్పులపై డ్యాన్స్ చేయించారు. ఈ అమానుష్య ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా జిల్లాలో జరిగింది. మార్చి 4న ముర్బాద్ తాలూకా కెర్వెల్‌లోని గుడిలో ఓ మతపరమైన కార్యక్రమం చేశారు. 

ALSO READ :- మా డబ్బులతో స్టేడియం కట్టిస్తే.. నా పోస్టే పీకేశారు: వివేక్ వెంకటస్వామి

ఊరిలో ఓ వృద్ధుడు చేతబడి చేస్తున్నాడని 20మంది గ్రామస్తులు అతన్ని ఇంట్లోనుంచి లాకొచ్చి, కొట్టారు. కాలే నిప్పులపై నృత్యం చేయించారు. బాధితునికి తీవ్రగాయాలైయ్యాయి. కాళ్లు బాగా కాలిపోయాయి. దాడికి పాల్పడిన ఊరి ప్రజలపై మంగళవారం ముర్బాద్ స్టేషన్  పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఎఫ్ఆర్ఐ ఫైల్ చేశారు.