
ఒలింపియన్ రజత పతక విజేత సాయిఖోమ్ మీరాబాయి చాను.. పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మణిపూర్ పోలీసు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు స్వీకరించినట్లు మణిపూర్ సీఎం ఎన్. బిరెన్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశమిచ్చినందుకు ముఖ్యమంత్రికి మీరాబాయి కృతజ్ఞతలు తెలిపింది.
‘మణిపూర్ పోలీసు విభాగంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా చేరడం గౌరవంగా ఉంది. దేశానికి మరియు రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి నాకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని మీరాబాయి ట్వీట్ చేశారు. ఏఎస్పీగా బాధ్యతలు సేకరించి.. సీఎంతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్లో షేర్ చేసింది.
It is an honour to have joined the Manipur Police as the Additional Superintendent of Police (Sports). I would like to thank the state of Manipur and our Hon'ble Chief Minister @NBirenSingh sir, for giving me this opportunity to serve the country and its citizens.#JaiHind pic.twitter.com/doRkTxQkj4
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) January 15, 2022
For More News..