
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' కోసం కేంద్రం ఆగస్టు 31న కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడ్డాయి. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ ఖర్చును తగ్గించడంతో పాటు పాలనా సమయాన్ని సైతం ఆదా చేయాలని కేంద్రం భావిస్తోంది.
ALSO READ:కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి హత్య.. ఘటనా స్థలంలో కొడుకు తుపాకీ
నవంబరు-డిసెంబర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఆ తర్వాత వచ్చే ఏడాది మే-జూన్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు పార్టీల ఎత్తుగడలు సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ పోటీ .. దాంతో పాటు షెడ్యూల్ చేసిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని తలపిస్తున్నాయి. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. ఇది చారిత్రాత్మకమైన చర్య అని, ఇది దేశ ప్రయోజనాలేనని బీజేపీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది..
देश के हित में #एक_देश_एक_चुनाव के लिए उठाया गया शानदार कदम है!
— Keshav Prasad Maurya (@kpmaurya1) September 1, 2023
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में ऐतिहासिक कदम है!