- మరో 40 స్టోర్లు తెరుస్తాం
- వెల్లడించిన ఆప్ట్రానిక్స్
హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా 60 స్టోర్లు ఏర్పాటు చేయడం ద్వారా యాపిల్కు ఇండియాలోనే అతిపెద్ద రీసెల్లర్గా ఎదిగామని ఆప్ట్రానిక్స్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్టోర్ల సంఖ్యనున వందుకు చేర్చుతామని, కొత్తగా 40 స్టోర్లను తెరుస్తామని తెలిపింది. 2011లో బేగంపేట్లో ఒకే స్టోర్తో ప్రారంభమైన ఆప్ట్రానిక్స్, యాపిల్ భాగస్వామిగా దేశవ్యాప్తంగా ఎదుగుతోంది.
ప్రస్తుతం సంస్థకు 20 నగరాల్లో 60 రిటైల్ స్టోర్లు, 16 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 600 మంది ఉద్యోగులతో యాపిల్ ప్రొడక్టులను ఎంతో మందికి చేరువ చేస్తున్నామని ఆప్ట్రానిక్స్ తెలిపింది. కస్టమర్లు ఎలక్ట్రానిక్ వేస్ట్ను పారవేసేందుకు చెన్నైలో ఈ–-వేస్ట్ టవర్ను ప్రారంభించామని సంస్థ తెలిపింది.