అబూజ్​మడ్​ ఎన్​కౌంటర్​లో ఓరుగల్లు వాసి మృతి

అబూజ్​మడ్​ ఎన్​కౌంటర్​లో ఓరుగల్లు వాసి మృతి

హసన్​పర్తి, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం నారాయణపూర్​ జిల్లా అబూజ్​మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్​ కౌంటర్​లో హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన బుర్ర రాకేశ్​ అలియాస్​ యుగేంద్ర అలియాస్​ వివేక్​ చనిపోయాడు. ఆయన కేశవరావు కంప్యూటర్  ఆపరేటర్ గా పని చేసేవాడని తెలిసింది.

గ్రామంలోని స్కూల్​లో 2008లో పదో తరగతి చదివిన రాకేశ్​ ఇంటర్, డిగ్రీ, పీజీ హనుమకొండలోని ప్రైవేట్​ కాలేజీల్లో చదివాడు. పెండ్లి చేసుకోకుండా బంధువుల సాయంతో 2016లో దళంలో చేరాడు.  తొమ్మిదేండ్లుగా దళంలో కొనసాగుతున్న ఆయన చనిపోయినట్లు తెలవడంతో చింతగట్టు గ్రామంలో విషాదం నెలకొంది.