
- మెజార్టీ సీఈఓల మాట ఇదే
- తర్వాత ప్లేస్లో వియత్నాం, థాయ్లాండ్
- సర్వీస్ కంటే మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లోనే ఆసక్తి
చైనాను వీడుదామనుకుంటున్న కంపెనీలకు మన దేశం ఆల్టర్నేటివ్గా కనిపిస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీల (ఎంఎన్సీల) సీఈఓలు ఓ సర్వేలో ఇదే విషయాన్ని వెల్లడించారు. చైనాకు జియోపొలిటికల్ సమస్యలు పెరగడంతో బిజినెస్, ట్రేడ్కు ఇబ్బంది కలుగుతుందని వారు తెలిపారు. ఐఎంఏ ఇండియా 100 మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన సీఈఓలతో చేసిన సర్వే ప్రకారం, 88 శాతం మంది సీఈఓలు ఇండియాను చైనాకు ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు. గ్లోబల్ వర్క్ఫోర్స్లో ఇండియా వాటా 24.9 శాతానికి పెరగడాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు థాయ్లాండ్, వియత్నాం, తమ సొంత ప్రాంతాలను కూడా ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.
బిజినెస్ డెస్క్, వెలుగు: చైనా నుంచి బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తున్న లేదా కొత్త డెస్టినేషన్ కోసం వెతుకుతున్న కంపెనీలకు ఇండియా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీల (ఎంఎన్సీల) సీఈఓలు ఇదే విషయాన్ని ఓ సర్వేలో వెల్లడించారు. అంతేకాకుండా వీరు థాయ్లాండ్, వియత్నాంలను, తమ సొంత ప్రాంతాలను కూడా చైనాకు ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు. చైనాకు జియోపొలిటికల్ సమస్యలు ఎక్కువవ్వడంతో బిజినెస్, ట్రేడ్కు ఇబ్బంది కలుగుతుందని కంపెనీల సీఈఓలు పేర్కొన్నారు. ఐఎంఏ ఇండియా వంద మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన సీఈఓలతో చేసిన సర్వే ప్రకారం, 88 శాతం మంది సీఈఓలు ఇండియాను చైనాకు ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు. ‘చాలా ఎంఎన్సీలు గత ఐదేళ్లలో ఇండియాలో తమ బిజినెస్ను విస్తరించుకోవడాన్ని చూడొచ్చు. కొంత చైనాకు ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ను ఎన్నుకోవడంలో భాగంగా ఈ కంపెనీలు తమ బిజినెస్లను విస్తరించాయి. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఇండియాలోని తమ ఆఫీసుల్లో ఉద్యోగులను పెంచుకుంటున్నాయి’ అని ఐఎంఏ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ సూరజ్ సైగల్ అన్నారు. ఈ సర్వే ప్రకారం, 70 శాతం కంపెనీలు చైనాలో గత మూడేళ్లలో తమ వ్యాపార విధానాలను భారీగా మార్చుకున్నాయి. ఇక్కడ సర్వీస్ సెక్టార్ కంటే ఇండస్ట్రీయల్ సెక్టార్ తమ బిజినెస్ విస్తరణను తగ్గించేసింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లోని 56 శాతం కంపెనీలు చైనా నుంచి సోర్సింగ్ తగ్గించామని, 41 శాతం కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించామని వెల్లడించాయి. కొన్ని కంపెనీలు చైనా నుంచి ఇప్పటికే ఎగ్జిట్ అయిపోయాయి. 6 శాతం కంపెనీలు తమ బిజినెస్ను మళ్లీ పెంచామని వెల్లడించాయి.
ఇండియాలో అవకాశాలు..
ఇండియాలో బిజినెస్లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? కంపెనీలు వాటిని ఎలా అందిపుచ్చుకుంటున్నాయనే విషయాన్ని కూడా ఐఎంఏ ఇండియా సర్వే చేసింది. 2017–18 తో పోలిస్తే 2022–23 నాటికి గ్లోబల్ వర్క్ఫోర్స్లో ఇండియా వాటా 22.4 శాతం నుంచి 24.9 శాతానికి పెరిగింది. అదే రెవెన్యూ ప్రకారం చూస్తే, గ్లోబల్ షేర్లో ఇండియా వాటా 14.8 శాతం నుంచి 15.8 శాతానికి ఎగిసింది. గ్లోబల్ మార్కెట్లో ఇండియా వృద్ధి చెందుతుండడాన్ని ఇది చూపుతోంది. ఐఎంఏ సర్వే ప్రకారం, సర్వీస్ సెక్టార్లోని కంపెనీలతో పోలిస్తే ఎక్కువగా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఇండియా, వియత్నాం లేదా థాయ్లాండ్ను చైనాకు ఆల్టర్నేటివ్గా చూస్తున్నాయి. దీని బట్టి చాలా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు తమ సప్లయ్ చెయిన్ రిస్క్లను తగ్గించుకోవడంపై ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. సర్వేలోని పాల్గొన్న సర్వీస్ కంపెనీల్లో 80 శాతం కంపెనీలు చైనా ఫ్లస్గా ఇండియాలో తమ బిజినెస్లను విస్తరిస్తున్నామని వెల్లడించాయి. అదే ఇండస్ట్రీయల్ కంపెనీల్లో ఈ ఆలోచన విధానం తక్కువగా ఉంది. చాలా కంపెనీలు తమ సప్లయ్ చెయిన్ను మార్చుకోవడానికి ఇండియాను ఎంచుకున్నామని వెల్లడించాయి. ఆఫ్ షోరింగ్ (విదేశాల్లో వ్యాపారం పెట్టడం) , రీషోరింగ్ (సొంత దేశానికి వ్యాపారం షిఫ్ట్ చేయడం), ఫ్రెండ్షోరింగ్ (మిత్ర దేశాల నుంచి రామెటీరియల్స్ సేకరించడం) పై కంపెనీల సీఈఓలను ఐఏఎం అడిగింది. 45 శాతం మంది రెస్పాండెంట్లు ఆఫ్ షోరింగ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వీరు ఇప్పటికే ఆఫ్ షోర్లో వ్యాపారం పెట్టడం లేదా పెట్టే ప్లాన్లో ఉన్నారు.
సమస్యలు..
ఇన్వెస్ట్మెంట్లకు డెస్టినేషన్గా ఇండియాను చూసిన కంపెనీలు కూడా కొన్ని అంశాల్లో ఇబ్బంది పడుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులేషన్స్, స్కిల్ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నాయి.
బై లేటరల్ ట్రేడ్స్ పెరగడంతో ఫ్రెండ్ షోరింగ్ (మిత్ర దేశాల నుంచి రామెటీరియల్స్ సేకరించడం)ఈ మధ్య పాపులరవుతోందని ఈ సర్వే వెల్లడించింది. డీగ్లోబలైజేషన్, నేషనలిజం పెరగడంతో దేశాలు
ఫ్రెండ్లీ బై లేటరల్ సంబంధాలు ఉన్న దేశాలతో పనిచేయడానికి ఆసక్తి
చూపిస్తున్నాయి.