
జునాగఢ్: రాజ్యాంగాన్ని కాపాడట మే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. గుజరాత్లో బుధవారం కాంగ్రెస్ జిల్లా, సిటీ అధ్యక్షులకు 10 రోజుల ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించే ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోరాడటం అనేది సాధారణం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించడమే మా ప్రధాన లక్ష్యం. గాంధీ, వల్లాభ్ భాయ్ పటేల్ వంటి గొప్ప వ్యక్తులు ఇక్కడే జన్మించి దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. వారు మనకు అత్యంత గౌరవనీయులు. వారి వల్లే దేశం ఐక్యం ఉంది. కానీ, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకోవడం లేదు” అని తెలిపారు.