
కరోనా విపత్తు వేళ భౌతిక దూరాన్ని పాటించాల్సిన సమయంలో కిస్సింగ్ పోటీని నిర్వహించింది ఓ కంపెనీ. ఈ ఘటన చైనాలోని సుజౌ నగరంలో ‘యుయా’ అనే ఫ్యాక్టరీలో జరిగింది. కరోనా విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాలో పలు ఫ్యాక్టరీలు తెరుచుకుంటున్నాయి. ఈ మధ్య తిరిగి ప్రారంభించిన ‘యుయా’ ఫ్యాక్టరీ… తమ ఉద్యోగులతో కిస్సింగ్ పోటీని నిర్వహించింది. అయితే ఒక ప్లెక్సీ గ్లాస్ ను మధ్యలో ఉంచి ఇరువైపులా నిలపడి ముద్దుపెట్టుకున్నారు ఉద్యోగులు… ఆ సమయంలో తమ మాస్క్లను తీసేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భౌతిక దూరాన్ని పాటించాల్సిన సమయంలో ఇలా బాధ్యత లేకుండా చైనా కంపెనీ ప్రవర్తించడం దారుణం అని అంటున్నారు.
కంపెనీ యజమాని మా.. మాట్లాడుతూ… ఫ్యాక్టరీలో పనిని తిరిగి ప్రారంభించినందుకు సంబరాల పోటీని నిర్వహించామని చెప్పారు. అయితే ప్రమాదాన్ని తగ్గించడానికి ఇరువురికి మధ్యలో ఫ్లెక్లీ గ్లాస్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో కొందరు దంపతులు కూడా ఉన్నట్లు తెలిపారు. కరోనా వలన ప్రజలు భయాందోళనకు గురయ్యారని.. చాలా రోజులుగా భయంతో బతికారని ఆయన చెప్పారు. అయితే ఆ ప్రభావం పని మీద పడకుండా ఉద్యోగులు ప్రశాంతంగా పని చేసుకోవడానికి ఇలా కిస్సింగ్ పోటీ నిర్వహించామని చెప్పారు.
#China A furniture factory in Suzhou, Jiangsu had a "Kissing Contest" to celebrate the factory resuming work.
The organisers said this event can help the factory workers relax & there's a transparent glass between the kissers.
Allegedly some of the participants are not couples. pic.twitter.com/9BWWpBkaAs
— W. B. Yeats (@WBYeats1865) April 19, 2020