కరోనా టెర్రర్.. 2 లక్షల మంది బలి

కరోనా టెర్రర్.. 2 లక్షల మంది బలి

న్యూయార్క్​: కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా చనిపోయారు. శనివారం నాటికి 2,03,269 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య 29,20,905కు చేరింది. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 9,60,651 కు చేరింది. మృతుల సంఖ్య 54,256కు పెరిగింది. ఇందులో ఒక్క న్యూయార్క్​లోనే 2.90 లక్షల కేసులు నమోదయ్యాయి. 21,728 మంది చనిపోయారు. తాజాగా బ్రిటన్​లో మృతుల సంఖ్య 20 వేలు దాటింది.

దేశంలో 800 దాటిన మరణాలు 

దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 825కి చేరింది. శనివారం ఒక్కరోజే 1,819 కొత్త కేసులు నమోదు కాగా, 44 మంది మరణించారు. 443 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 26,267కి చేరుకుంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 811 కేసులు, గుజరాత్ లో 256 కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 7,628 కేసులు నమోదు కాగా, 323 మంది మరణించారు. గుజరాత్ లో కేసులు 3వేలు, ఢిల్లీలో 2,500 దాటాయి. రాజస్థాన్ లో 2వేలు దాటగా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లో 2వేలకు చేరువలో ఉన్నాయి.