దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. వారం క్రితం మొదలైన 12 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లల వ్యాక్సినేషన్ అప్పుడే అర కోటి మైలు రాయిని దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ మన దేశంలోనే సాగుతోందని, ఈ కార్యక్రమంలో ఇవాళ మరో మైలు రాయిని దాటామని ఆయన ట్వీట్ చేశారు. 12 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లల్లో 50 లక్షల మందికి పైగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసి చెప్పారు.
Another feather in the cap of the world's largest vaccination drive ?
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 23, 2022
Over 50 lakh youngsters between 12-14 age group have received their first dose of #COVID19 vaccine ?? ??
Extremely proud of our young warriors!#SabkoVaccineMuftVaccine pic.twitter.com/3mk4OnLJ4e
కాగా, దేశంలో అన్ని వయసుల వారికీ కలిపి ఇప్పటి వరకు 182 కోట్ల డోసులు వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ఫస్ట్ డోస్ 97.72 కోట్లు, రెండో డోస్ 83.29 కోట్లు, బూస్టర్ డోస్ 2.08 కోట్లు చొప్పున ఉన్నట్లు పేర్కొంది.
#LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/IHDmYV9a06
— Ministry of Health (@MoHFW_INDIA) March 23, 2022