ఉగ్రవాదులకు నిధుల కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరులను పాకిస్థాన్ లోని లాహోర్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత జమాత్ ఉద్ దవాకు చెందిన ఆరుగురు నేతలను నిర్దోషులుగా తీర్పునిచ్చింది. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జేయూడీ... లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు జేయూడీకి చెందిన ఐదుగురు అగ్రనేతలకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. మాలిక్ జాఫర్ ఇక్బాల్, యాహ్యా ముజాహిద్ , నసారుల్లాహ్ , సమియుల్లాహ్, ఉమర్ బహదూర్ ఈ శిక్ష పడింది. హఫీజ్ సయీద్ బావమర్ది హఫీజ్ అబ్దుల్ రహ్మన్ మక్కికి 6 నెలల శిక్ష విధించింది. ఈ శిక్షలను లాహోర్ హైకోర్టు రద్దు చేసింది.