ఇండియన్ బిల్డింగులను  పేల్చేయండి

ఇండియన్ బిల్డింగులను  పేల్చేయండి

 

  • అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లోని పాక్‌‌‌‌‌‌‌‌ ఫైటర్లు, తాలిబన్లకు ఐఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఆదేశం

న్యూఢిల్లీ:  అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌లో గత 20 ఏండ్లలో ఇండియా కట్టిన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లు, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నాశనం చేయాలని పాక్‌‌‌‌‌‌‌‌ ఫైటర్లు, తాలిబన్లను పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ (ఐఎస్‌‌‌‌‌‌‌‌ఐ) ఆదేశించింది. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లో అమెరికా బలగాలు వెనక్కి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబన్లకు మద్దతుగా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఫైటర్లు రంగంలోకి దిగారు. దాదాపు 10 వేల మందికి పైగా పోరస్‌‌‌‌‌‌‌‌ బార్డర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అయినట్లు సమాచారం. తాలిబన్ల కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇండియా ఆస్తులను ఫస్ట్ నాశనం చేయాలని ఆఫ్గాన్‌‌‌‌‌‌‌‌ తాలిబన్లు, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఫైటర్లకు స్పష్టమైన ఆదేశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాబుల్‌‌‌‌‌‌‌‌ నుంచి 2001లో తాలిబన్లు వెళ్లిపోవడంతో ఇండియా ఆ దేశంలో 3 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఇందులో డెలారామ్‌‌‌‌‌‌‌‌-జరంజ్‌‌‌‌‌‌‌‌ మధ్య 218 కిలోమీటర్ల పొడవైన రోడ్డు, ఇండియా– అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌కు గుర్తుగా నిర్మించిన సల్మా డ్యామ్‌‌‌‌‌‌‌‌, అలాగే 2015లో ఇండియా కట్టిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ భవనాలను నిర్మించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులు, భవనాల నిర్వహణలో పాల్గొంటున్న ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ వెంటనే వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.