మధిర, వెలుగు: కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడు స్పృహ కోల్పోగా మధిర రైల్వేస్టేషన్లో ట్రైన్ఆపి ఆస్పత్రికి తరలించిన ఘటన గురువారం జరిగింది.
మధిర రైల్వేహెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముంబాయి నుంచి భువనేశ్వర్ వెళ్తుతున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కూలి పని కోసం వెళ్లేందుకు ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా పెద్దబయలు గ్రామానికి చెందిన కీముడు జీవన్ కుమార్, కుర్ర లోకేశ్కుమార్ ప్రయాణిస్తున్నారు.
ట్రైన్ మధిర సమీపానికి రాగానే జీవన్ స్పృహ కోల్పోయాడు. వెంటనే ప్రయాణికులు మధిర రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని108అంబులెన్స్ లో మధిర ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కాగా, వారు డబ్బులు లేక రెండు రోజుల నుంచి అన్నం తినలేదని, ఈ క్రమంలోనే జీవన్ స్పృహ కోల్పోయాడని తెలిసింది.
