సీఎం కేసీఆర్ పై
పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘‘రైతులకు శుభవార్త అంటున్న సీఎం కేసీఆర్కు సిగ్గుండాలె. రైతులకు పంట రుణాలను మాఫీ చేయడంలేదు. రైతు బంధు ఇవ్వడంలేదు. పంట నష్ట పరిహారం ఇవ్వడంలేదు. ఇప్పుడున్న పథకాలే అందడంలేదు. ఇంకా రైతులకు శుభవార్త ఏందీ? రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు చేశారా?” అని పీసీసీ చీఫ్ఉత్తమ్కుమార్రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం కాంగ్రెస్ జడ్పీటీసీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద గతంలో ఉన్నదాని కంటే అదనంగా ఒక్క ఎకరానికీ నీరు అందలేదన్నారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతోనే పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా 20 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని, ఈ ప్రాజెక్టు కింద పండిన పంటను కాళేశ్వరం కింద పండినట్లుగా కేసీఆర్ చూపిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సర్పంచ్ లకు, మండల పరిషత్తులకు నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందన్నారు. టీఆర్ఎస్ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కేడర్ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.