రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని తరలించొద్దు : పీడీఎస్యూ లీడర్లు

రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని తరలించొద్దు :  పీడీఎస్యూ లీడర్లు

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా రుద్రూర్​ అగ్రికల్చర్​ పాలిటెక్నిక్​ కాలేజీని జగిత్యాలకు తరలించే నిర్ణయాన్ని విరమించుకోవాలని పీడీఎస్​యూ లీడర్లు డిమాండ్​ చేశారు. సోమవారం రుద్రూర్​ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం, వ్యవసాయ పాలిటెక్నిక్  కాలేజీ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు. పాలిటెక్నిక్ కాలేజీని జగిత్యాల కాలేజీలో విలీనం చేయడానికి ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారని తెలిపారు. 

జిల్లాలోని ఒకే ఒక్క అగ్రికల్చర్  పాలిటెక్నిక్​ను తరలించడం సరికాదన్నారు. పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు ఆర్​ గౌతం కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కార్తీక్, అక్బర్ నగర్  సర్పంచ్  సీతారాం రాజు, ఉప సర్పంచ్  హబీబ్ ఖాన్, నగేశ్, సంజీవులు, సాయిలు పాల్గొన్నారు.