![ఏసీలు మస్తు కొంటున్నరు..సిటీలో మండిపోతున్న ఎండలు](https://static.v6velugu.com/uploads/2024/04/people-are-interested-in-buying-more-ac-in-summer-season_53CtB9LlvP.jpg)
- ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు జనాలు ఇంట్రెస్ట్
- సిటీలో రోజూ పదివేలకు పైగా అమ్మకాలు
- కొనుగోలుదారులతో రద్దీగా ఎలక్ట్రానిక్ స్టోర్స్
- భారీగా పెరిగిన విద్యుత్ వాడకం
హైదరాబాద్, వెలుగు : సమ్మర్ సీజన్ షురువైంది. సిటీలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. చెమట, ఉక్కపోత, ఎండ వేడిమి తట్టుకోలేక జనాలు చల్లదనంలో సేదతీరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లతో సరిపోకపోతుండగా ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తుండగా ఫుల్డిమాండ్ఏర్పడింది. ఈ సమ్మర్లో అధికంగా అమ్ముడుపోతుండగా ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లు రద్దీగా కనిపిస్తున్నాయి. మధ్య తరగతి వర్గాల వారే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడంతో ఏసీల అమ్మకాలు పెరుగుతున్నాయి.
రోజుకు వేలల్లో సేల్స్..
సిటీలో రోజుకు 10 వేలకుపైనే ఏసీలు అమ్ముడవుతున్నట్టు అంచనా. మున్ముందు పెరగొచ్చు. ఇప్పటికే డెలివరీలకు 4,5 రోజుల టైమ్పడుతుంది. ఫిట్టింగ్కు మరో రెండు రోజులు అవుతుంది. ఎక్కువగా 5 స్టార్రేటింగ్ఏసీలు, 1.5 టన్స్కొంటున్నారు. సాధారణంగా 1 నుంచి 5 స్టార్వరకు రేటింగ్ ఉంటుంది. రేటింగ్ పెరిగే కొద్ది కరెంట్వాడకం తగ్గుతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలతోనూ విద్యుత్ వాడకం తగ్గుతుండగా వాటిని కూడా కొంటున్నారు. ఏసీలు బేసిక్గా 30 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. స్టోర్స్ నిర్వాహకులు జీరో ఇంట్రెస్ట్తో ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తుండగా కొనేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది.
రికార్డ్ స్థాయిలో కరెంట్ వాడకం
పెరిగిపోతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా సిటీలో రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం నమోదవుతుంది. సమ్మర్ లో ప్రజలు బోర్ మోటార్లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో కరెంట్వినియోగం కూడా అధికంగానే ఉంటుంది. గతేడాది మేలో కరెంట్ వాడకం రికార్డులను పోల్చితే.. ఈఏడాది మార్చిలోనే దాటింది. 2023లో మే 19న అధికంగా 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ నమోదైతే.. గత మార్చి 28న 79.48 మిలియన్యూనిట్ల వాడకంతో పాత రికార్డ్ ను క్రాస్చేసింది. మార్చి లో తొలి నుంచే కరెంట్వాడకం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మేలో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుండగా మరింతగా విద్యుత్ఖర్చు పెరగనుంది.
పాప కోసం తీసుకున్నాం
ఈసారి ఎండలు ఎక్కువగాఉన్నాయి. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే మే లో ఇంకా దారుణంగా ఉండొచ్చు. ప్రస్తుతం కూలర్ వాడుతున్నం. కానీ అది సరిపోవట్లేదు. ఇటీవలే మాకు పాప పుట్టింది. ఈ వేడిని తట్టుకోలేదు. అందుకే ఏసీ కొనక తప్పట్లేదు. ఏసీల రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈఎమ్ఐలో తీసుకున్నా.
సందుపట్ల రవి కుమార్, ప్రైవేట్ ఎంప్లాయ్,అమీర్ పేట్
ఈఎంఐలోనే ఎక్కువగా కొంటున్నరు
గతేడాది కంటే ఈసారి సేల్స్పెరిగాయి. రోజూ 100 ఏసీలకు పైనే అమ్ముతున్నాం. ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. దీంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
రవి, సీనియర్ ప్రమోటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, పంజాగుట్ట