ఇళ్ల పట్టాఇచ్చి లాక్కున్నరు..ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రజలు

ఇళ్ల పట్టాఇచ్చి లాక్కున్నరు..ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రజలు

వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రం సమీపంలోని చిట్యాల వద్ద 1996లో ఇచ్చిన 220 ఇండ్ల స్థలాల్లో డబుల్  బెడ్రూమ్  ఇండ్లు నిర్మించి తమకు ఇవ్వకపోవడంపై పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్  తేజస్  నందలాల్ పవార్ కు కలిసి తమ గోడు వినిపించారు.

 తాము ఇల్లు కట్టుకోలేదని చెప్పి స్థలాలు తీసుకున్నారని, తమకు డబుల్  ఇల్లు ఇస్తామని చెప్పి డిప్  తీసి రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి కేటాయించారని వాపోయారు. తమకు ఇండ్లు కేటాయించాలని వేడుకున్నారు.