
కొడంగల్, వెలుగు: వర్కింగ్జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కొడంగల్ప్రెస్ క్లబ్సభ్యులు కోరారు. శుక్రవారం కొడంగల్పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నో ఏండ్లుగా కొడంగల్లో పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులు ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానిక పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తుచేశారు. కార్యక్రమంలో కిషన్రావు, కత్తి ప్రభాకర్, పృథ్వీరాజ్, పకీరప్ప, శ్రీనివాస్, రమేశ్, ప్రసాద్, గోపాల్, నరేందర్, నరేశ్, శ్రీకాంత్, రాకేశ్ పాల్గొన్నారు.