పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలను స్వచ్ఛ భారత్ 2.0లో భాగంగా పూర్తిగా తొలగిస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అలాగే.. నాలాలు శుభ్రం చేయడం, భద్రతా నిర్వహణపైనా దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. మురికి నీరు నదుల్లో కలవకుండా చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు. ఇక.. దేశంలో ప్రతి రోజు లక్ష టన్నుల వేస్టేజ్ ప్రాసెసింగ్ అవుతోందన్నారు. 2014లో 20 శాతం చెత్త ప్రాసెస్ జరిగితే.. ఇప్పుడు దానిని 70 శాతానికి పెంచామని మోడీ చెప్పారు. దీనిని 100 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్ 2.0 స్కీంలు ప్రారంభించాక ఢిల్లీలో ఆయన మాట్లాడారు.
see more news
సీతక్కపై కేసీఆర్ సీరియస్.. ఏదిపడితే అది అడగొద్దు
చైనాకు సీక్రెట్ కాల్స్ చేశాం .. ఒప్పుకున్నఅమెరికా ఆర్మీ జనరల్
సీతక్క వర్సెస్ స్పీకర్: ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా?