పారికర్ కు ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మల నివాళి

పారికర్ కు ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మల నివాళి

గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ఢిల్లీనుంచి గోవా రాజధాని పనాజీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ … తన ప్రియతమ సహచరుడు మనోహర్ పారికర్ కు కడసారి నివాళులు అర్పించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా మనోహర్ పారికర్ పార్థివ దేహానికి చివరిసారి నివాళులు అర్పించారు.

పారికర్ కుటుంబసభ్యులను ఓదార్చారు మోడీ, నిర్మలా సీతారామన్, మృదులా సిన్హా. బీజేపీ ఆఫీస్ కు పారికర్ పార్ధివదేహం తీసుకొచ్చిన తర్వాత.. పలువురు కేంద్రమంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు.

కంటతడి పెట్టిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

ముఖ్యమంత్రి పారికర్ పార్ధివదేహానికి నివాళులు అర్పించారు కేంద్రమంత్రి స్మృతిఇరానీ. ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు స్మృతి ఇరానీ.