తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అన్నీ పార్టీలు ప్రచార జోరును పెంచాయి. మహబూబాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను మోసం చేశాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు ఇచ్చి.. మోసం చేశారన్నారు. నియామకాలకు మొత్తం కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయన్నారు. తెలంగాణకు ఫామ్ హౌస్ సీఎం అవసరంలేదన్న ప్రధాని మోదీ ... బీజేపీతో దోస్తి చేయాలనిర్ ఢిల్లీ వచ్చారన్నారు. బీఆర్ఎస్ ను ఎన్డీఏలో చేర్చుకోలేదని తనను బీఆర్ఎస్ నేతలు తిడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ తమ దరిదాపుల్లోకి రానివ్వమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక స్కాంలు జరిగాయి.. తెలంగాణలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేస్తామన్నారు. ల్యాండ్, లిక్కర్, పేపర్ మాఫియాలను జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబోతుందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఫామ్ హౌస్ సీఎం తొలగాలన్నారు. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించామన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మహబూబాబాద్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ తెలిపారు.