ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. జ్వరం, నీరసం కారణంగా మన్మోహన్ బుధవారం ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు గతంలోనే బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం మన్మోహన్కు కార్డియో న్యూరో యూనిట్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మన్మోహన్ ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు.
Delhi: Union Health Minister Mansukh Mandaviya arrives to meet former Prime Minister & Congress leader Dr Manmohan Singh at All India Institute of Medical Sciences, Delhi
— ANI (@ANI) October 14, 2021
Singh was admitted to AIIMS Delhi, yesterday pic.twitter.com/cjVhJvMQm4
మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంగా ఉండాలని... త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన ట్వీట్ చేశారు.
I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji.
— Narendra Modi (@narendramodi) October 14, 2021
మన్మోహన్ సింగ్కు ఛాతీ నొప్పి రావడం.. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో అడ్మిట్ చేశారు. మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైనప్పుడు కరోనా బారిన పడ్డారు. అప్పుడు కూడా ఇదే ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స చేయించుకొని కోలుకున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ నితీష్ నాయక్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం మన్మోహన్ సింగ్కు చికిత్స అందిస్తోంది.
For More News..