టీ స్టాల్లో చాయ్ తాగిన ప్రధాని మోడీ

టీ స్టాల్లో చాయ్ తాగిన ప్రధాని మోడీ

వారణాసి: యూపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్రమోడీ సాధారణ వ్యక్తిలా ఓ టీ స్టాల్కు వెళ్లి చాయ్ తాగారు. యూపీ చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. మధ్యలో ఓ టీస్టాల్కు వెళ్లిన మోడీ మట్టి గ్లాసులో ఇచ్చిన చాయ్ తాగుతూ కాసేపు సేదదీరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ప్రధాని నరేంద్రమోడీ శనివారం కూడా యూపీలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పాల్గొననున్నారు.
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్లో ఈ నెల 7న తుది దశ పోలింగ్ జరగనుంది. చివరి విడతలో వారణాసితో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 8జిల్లాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.