పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్.. బ్యాంకులో డబ్బుంది, తీసుకోలేరు

పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్.. బ్యాంకులో డబ్బుంది, తీసుకోలేరు

పీఎంసీ ఖాతాదారులు లావాదేవీలకు సంబంధించి తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఎందుకు భయపడ్డారంటే…

  • ఈ ఏడాది సెప్టెంబర్ 24న ముంబైలోని పీఎంసీని ఆర్నెల్ల పాటు కంట్రోల్​లో పెడుతున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. అంటే.. ఆ బ్యాంకు రెగ్యులర్​ లావాదేవీలపై అన్ని నిర్ణయాలు ఆర్​బీఐ తీసుకుంటుందన్నమాట. పీఎంసీకి ఎలాంటి అధికారం ఉండదు. డైరెక్టర్ల బోర్డు రద్దవుతుంది.    పీఎంసీ కస్టమర్లు ఇకపైన తమ ఖాతా నుంచి వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోలేరు. ఆర్నెల్లపాటు ఈ రూల్ అమల్లో ఉంటుంది. ముంబైలోని పీఎంసీ బ్రాంచీలకు పరుగులు తీశారు. ఖాతాదారుల్లో ఎక్కడ చూసినా పానిక్ సిట్యుయేషన్. చాలాచోట్ల బ్యాంకు సిబ్బంది గాయబ్​ అయ్యారు. కొన్ని బ్రాంచీలకు అసలు తాళమే తియ్యలేదు. పీఎంసీ ఏటీఎంలకు షట్టర్లు ఎత్తలేదు. అన్ని బ్రాంచీల దగ్గర పెద్ద ఎత్తున పోలీసు సెక్యూరిటీ.
  • మొదటిరోజు వెయ్యి రూపాయలు విత్​ డ్రా లిమిట్​ పెట్టి, ఖాతాదారులు గగ్గోలు పెట్టడంతో పదివేలకు పెంచారు. ప్రస్తుతం ఈ లిమిట్​ను 25 వేలకు పెంచడంతో కస్టమర్లు  శాంతించారు.
  • ఆరోగ్య కారణాలను స్పష్టంగా చూపించగలిగితే మాత్రం ఆర్​బీఐ వెసులుబాటు కల్పిస్తుంది. కేసు సిన్సియర్ అని రుజువు చేసుకోవాలి.
  • ఆర్బీఐ ఆంక్షలు ఉన్న ఏ బ్యాంకయినా కొత్త డిపాజిట్లు తీసుకోలేదు. అలాగే, కొత్తగా లోన్లు శాంక్షన్ చేసే పవర్ ఉండదు.
  • అకౌంట్​ హోల్డర్లు పీఎంసీ నుంచి ఇతర బ్యాంకు ఖాతాలకు ఆన్​లైన్​ ట్రాన్స్​ఫర్ చేయలేరు. మనీ ట్రాన్స్​ఫర్​కి ఆర్​బీఐ రూల్స్ ఒప్పుకోవు. పెన్షన్ మీద బతికే సీనియర్ సిటిజన్​లకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి.
  • సరే, ఆర్నెల్ల తరువాత ఏం జరగొచ్చు? ఆర్బీఐ రూల్ బుక్​ ప్రకారం ఆంక్షలను సడలించవచ్చు. లేదా ఎత్తేయవచ్చు. ఆర్​బీఐకి నమ్మకం కుదరకపోతే మరికొంతకాలం కంటిన్యూ చేయవచ్చు.
  • గురువారం ముంబై టూర్​కు వెళ్లిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను  ఖాతాదారులు కలవగా, ఆర్బీఐ గవర్నర్​తో మాట్లాడతానని ఆమె  భరోసా ఇచ్చారు.