
ఎల్బీనగర్, వెలుగు: సీఎం ఆపీసు(సీఎంవో)లో అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని భీమవరానికి చెందిన బుసి ప్రవీణ్సాయి(23) కొంతకాలం కిందట సిటీకి వచ్చి వనస్థలిపురంలోని ద్వారకామయినగర్లో ఉంటున్నాడు. బేగంపేటకు చెందిన వీరభద్ర అనే డ్రైవర్కు ప్రవీణ్ సాయితో పరిచయం ఏర్పడింది.
తాను తెలంగాణ సీఎంవోలో పనిచేస్తానని, ప్రొటోకాల్ అడ్వయిజర్అని ప్రవీణ్ సాయి అతడితో చెప్పాడు. అబ్దుల్లాపూర్మెట్ మండలం గండిమైసమ్మ ఆలయం వెనుక ఉన్న భూమిని చూపించి దాన్ని తక్కువ రేటుకు ఇస్తానని చెప్పి వీరభద్ర నుంచి రూ.7 లక్షల 10 వేలు వసూలు చేశాడు. అయితే, ఆ భూమిలో కొందరు వ్యక్తులు కన్ స్ట్రక్షన్ చేస్తండటంతో వీరభద్ర వెంటనే ప్రవీణ్సాయిని అడిగాడు.
ప్రవీణ్రెస్పాండ్ కాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన వీరభద్ర అబ్దుల్లాపూర్మెట్ పీఎస్లో కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కారు, సెల్ ఫోన్ను సీజ్ చేశారు. ప్రవీణ్ సాయి ఇలా పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మంత్రుల ఫేక్ లెటర్ హెడ్స్చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసేవాడని సమాచారం. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.