గురుకులం విద్యార్థినిపై..మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. జడ్చర్ల మండలంలో ఘటన

గురుకులం విద్యార్థినిపై..మహిళా వైస్  ప్రిన్సిపాల్  లైంగిక వేధింపులు.. జడ్చర్ల మండలంలో ఘటన
  • ప్రిన్సిపాల్, వైస్​ ప్రిన్సిపాల్​పై కేసు నమోదు

జడ్చర్ల, వెలుగు: మహబూబ్ నగర్  జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై మహిళా వైస్  ప్రిన్సిపాల్  లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి..

 జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని స్కూల్​లో చదువుకుంటుండగా వైస్  ప్రిన్సిపాల్  లైంగిక వేధింపులకు పాల్పడింది. దీనిపై ప్రిన్సిపాల్ కు బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఆమె ఈ విషయాన్ని దాచిపెట్టడంతో పాటు బాలికను భయభ్రాంతులకు గురి చేశారు.

 దీంతో బాధితురాలు జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ కు ఫోన్ లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని జడ్చర్ల పోలీసులను ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేశ్​ తెలిపారు.