కదిరి టీడీపీ అభ్యర్థి కారులో డబ్బు సంచుల పట్టివేత...

కదిరి టీడీపీ అభ్యర్థి కారులో డబ్బు సంచుల పట్టివేత...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరో పక్క ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎవరి పరయత్నాలు వారు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ కారులో డబ్బు సంచులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం విద్యుత్ నగర్ లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కందికుంట ప్రసాద్ వాహనాన్ని పట్టుకున్నారు.

అనంతపురం నుండి కదిరి వైపు వెళ్తున్న కారులో నగదు గుర్తించినట్లు తెలిపారు పోలీసులు.ఈ తనిఖీల్లో కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మూడు బ్యాగుల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నగదు గుర్తించిన కారు కందికుంట ప్రసాద్ పేరు మీద రిజస్టర్ అయినట్లు తెలిపారు పోలీసులు. నగదుతో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.