లోకేశ్వరం మండలంలో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు

 లోకేశ్వరం మండలంలో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు
  • నిందితుడి అరెస్ట్

భైంసా, వెలుగు: లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్​లో ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేందించారు. శనివారం భైంసాలో ఏఎస్పీ అవినాశ్ కుమార్ ​కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 14న అబ్దుల్లాపూర్​లో యమున అనే మహిళ రోడ్డు పక్కన పశువులను మేపుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమెకు మాయమాటలు చెప్పి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.

 దీంతో బాధితురాలు లోకేశ్వరం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. నిందితుడిని ముథోల్ ​మండలం ఆష్ఠ గ్రామానికి చెందిన పిప్పెర విజయ్​గా గుర్తించి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు గొలుసు, బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. విజయ్​ని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపినట్లు ఏఎస్పీ తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన ఎస్సై అశోక్​, సిబ్బందిని అభినందించారు. ముథోల్ ​సీఐ మల్లేశ్​ పాల్గొన్నారు.