హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ట్రై క్రీడా వేడుకలో భాగంగా నిర్వహించిన రెజ్లింగ్ పోటీల్లో హైదరాబాద్కు చెందిన పూజ, లోషిత, వైష్ణవి గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో సోమవారం జరిగిన అండర్17 విమెన్స్ పోటీల్లో ఈ ముగ్గురు వరుసగా 40, 46, 50 కేజీల కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు. 53 కేజీల్లో లక్ష్మి, 57 కేజీల్లో శ్రావణి, 65 కేజీల్లో కారుణ్య బంగారు పతకాలు గెలిచారు. విజేతలకు శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ మెడల్స్, సర్టిఫికెట్స్ అందించారు.
ఐటీ మంత్రి కేటీఆర్ బర్త్డేను పురస్కరించుకొని శాట్స్ ఆధ్వర్యంలో రెజ్లింగ్తో పాటు సైక్లింగ్, స్కేటింగ్ పోటీలను కూడా నిర్వహించారు. నెక్లెస్ రోడ్లో సైక్లింగ్, స్కేటింగ్ పోటీలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ పోటీలను సక్సెస్ చేసేందుకు సహకరించిన రాష్ట్ర సైక్లింగ్, రోలల్ స్కేటింగ్, రెజ్లింగ్ సంఘాలకు ఆంజనేయ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.