
కంటోన్మెంట్, వెలుగు: బోయిన్ పల్లి హెచ్ఎంటీ సబ్స్టేషన్లో చేపట్టిన మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆ పరిధిలోని ప్రాంతాల్లో బుధవారం కరెంటు సప్లయ్ నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఏవోఎల్ ఫీడర్ పరిధి హెచ్ఎంసీ సబ్స్టేషన్, చింతల్ ఫీడర్లోని హెచ్ఎంటీ మెయిన్రోడ్, అయ్యప్ప స్వామి టెంపుల్ ఏరియా హెచ్ఎంసీ ఫీడర్పరిధి హెచ్ఎంటీ కాలనీ, శ్రీసాయి కాలనీ ఫీడర్పరిధి భరత్నగర్, శ్రీసాయి కాలనీ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.