కెమికల్స్ లేకుండానే ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

కెమికల్స్ లేకుండానే ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

మహబూబ్​నగర్​, వెలుగు : గవర్నమెంట్ జూనియర్​ కాలేజీల్లో కెమికల్స్ లేకుండానే  స్టూడెంట్లతో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు.  నాలుగేండ్ల నుంచి ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ఎగ్జామ్స్​నిర్వహణకు రాష్ట్ర సర్కారు నుంచి రూపాయి రాకపోవడంతో.. ఉన్న వాటినే అడ్జెస్ట్​ చేస్తున్నారు. ఒక స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాడాల్సిన కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇద్దరు, ముగ్గురికి వాడుతున్నట్లు తెలుస్తోంది.  కొన్ని సబ్జెక్టులకు ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో..  ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించకుండానే పాస్ చేస్తున్నట్లు సమాచారం. 

పెన్నులు, పేప్లకు కూడా చాలని ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బోర్డ్​ఆఫ్​ఇంటర్మీడియట్​ఈ నెల 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్​ ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తోంది.  మహబూబ్​నగర్​ జిల్లాలోని 36 ప్రభుత్వ, ప్రైవేట్​జూనియర్​ కాలేజీలు ఉండగా.. ఒకేషనల్​ఫస్ట్​ ఇయర్​లోని 2,009 మంది స్టూడెంట్లు, సెకండ్ ఇయర్​లో 1,649 మంది, రెగ్యులర్​సెకండ్​ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపీసీ, బైపీసీ సబ్జెక్టులకు చెందిన 9,286 మంది స్టూడెంట్లు అవుతున్నారు.  ప్రైవేట్​కాలేజీల్లో ప్రాక్టికల్స్​కు సంబంధించి అన్ని రకాల ఎక్విప్​మెంట్, కెమికల్స్​ అందుబాటులో ఉండగా..  గవర్నమెంట్​కాలేజీల్లో కొన్ని అందుబాటులో లేవు. కెమిస్ట్రీకి సంబంధించి 24 రకాల కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గాను... కొన్ని కాలేజీలో సగం కూడా లేవు.  ప్రాక్టికల్స్​నిర్వహణ కోసం బోర్డ్​ఆఫ్​ ఇంటర్మీడియట్​నుంచి ప్రతి ఎంపీసీ స్టూడెంట్​కు రూ.16 చొప్పున, ప్రతి బైపీసీ స్టూడెంట్​కు రూ.24 చొప్పున ఫండ్​ ఇస్తున్నా.. అవి దేనికి సరిపోవడం లేదు. ఈ పైసలు కేవలం రెడ్, బ్లూ కలర్​స్కెచ్​పెన్నులు, కలర్​ పెన్స్​, ఏ4 సైజ్​ పేపర్లు కొనడానికే సరిపోతున్నాయి.

‘డే టు డే’ ఫండ్స్​ రావట్లే..

ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్​కాలేజీలో చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘డే టు డే’ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెండిచర్ కింద ఏటా రూ.76 చెల్లిస్తుంది.  ఉదాహరణకు ఒక కాలేజీలో వంద మంది స్టూడెంట్లు ఉంటే.. ఆ కాలేజీకి ఏడాదికి రూ.7,600 చెల్లిస్తుంది.  వీటితోనే ఇంటర్నల్​ ఎగ్జామ్స్​, ప్రాక్టికల్స్​​ మెటీరియల్స్​, చాక్​పీసులు, ఇతర స్టేషనరీ కొనాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం నాలుగేళ్లుగా ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదు.  దీంతో ప్రిన్సిపాళ్లు సొంత డబ్బును ఖర్చు చేసి వీటిని కొనాల్సి వస్తోంది.  దీనిపై ఎస్​టీవో బిల్లులు చేస్తున్నా... శాంక్షన్​లభించడం లేదు.  ఈ-కుబేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెలల తరబడి ఈ బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండిపోయాయి.

ఒకే సారి ఇద్దరికి..

రూల్ ప్రకారం ప్రతి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విడివిడిగా ప్రాక్టికల్స్​ నిర్వహించాలి. కానీ, కొన్ని గవర్నమెంట్​కాలేజీల్లో కెమికల్స్, పరికరాల కొరత వల్ల ఇద్దరిద్దరితో కలిపి చేయిస్తున్నారు. కొన్నింటికి కెమికల్స్​లేకపోవడంతో ఆ ప్రాక్సికల్స్​ను వదిలేయాలని సార్లే స్టూడెంట్లకు చెబుతున్నారు.  దీనికితోడు చాలా వరకు ప్రాక్టికల్​ థియరీకి సంబంధించి సిలబస్​ కూడా పూర్తి కాలేదని స్టూడెంట్లు తెలిపారు.  రికార్డ్స్​వరకే రాసి, ప్రాక్టికల్స్​కు వచ్చే సరికి వాటిని వదిలేస్తున్నారు.

తగ్గుతున్న సామర్థ్యాలు..

ప్రస్తుతం ఇంటర్​ సెకండ్​ఇయర్​ చదువుతున్న స్టూడెంట్లు కొవిడ్​ కారణంగా పరీక్షలు రాయలేదు.  ప్రభుత్వం వీరందరినీ పాస్​ చేసింది. గత ఎడ్యుకేషన్​ ఇయర్​లో వీరి ఇంటర్​ మొదటి సంవత్సరంలో జాయిన్​ కాగా, కాలేజీలను మూడు నెలలు ఆలస్యంగా తెరిచారు. దీంతో వీరికి పూర్తి స్థాయిలో సిలబస్ కాకుండానే ఎగ్జామ్స్​ రాశారు. ఇప్పుడు అకడమిక్​ ఇయర్​ మొదట్లోనే కాలేజీలు తెరిచినా, అరకొర సౌకర్యాలతో ప్రాక్టికల్స్​ను పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. దీని వల్ల వీరిలో సామర్థ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది.

ఉన్న వాటితోనే ప్రాక్టికల్స్​ చేశాం

సెకండ్​ ఇయర్​లో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్​లో కొన్ని మూలకాల ఫలితం రాబట్టడానికి నిర్ధారణ టెస్టులు చేయాల్సి ఉంటుంది. జువాలజీ, బొటనీలో కొన్ని  విచ్ఛేదనలు కూడా ఉంటాయి. అయితే కాలేజీలో వీటికి సంబంధించిన మెటీరియల్, కెమికల్స్​ లేకపోవడంతో లెక్చరర్లు ఉన్న వాటితోనే ప్రాక్టికల్స్ చేయించారు. 
–మహేందర్​, బైపీసీ సెకండ్​ ఇయర్​, మహబూబ్​నగర్​

ఇద్దరం కలిసి చేశాం

మా కాలేజ్​లో సరిపడా కెమికల్స్​, ఎక్విప్​మెంట్​ లేవు. ప్రాక్టికల్స్​ స్టార్ట్​ అయినప్పటి నుంచి కొన్ని సార్లు ఇద్దరిద్దరితో కలిపి ప్రాక్టికల్స్​ చేయిస్తున్నారు. సార్​ వాళ్లు చెప్పినట్లే మేం కూడా ఇద్దరిద్దరం కలిపి ప్రాక్టికల్స్​ చేస్తున్నాం. కానీ, ఏం అర్థం కావడం లేదు.
–నవీన్​, బైపీసీ సెకండ్​ ఇయర్​, అడ్డాకుల

ఫండ్స్​ ప్రాబ్లం లేదు

ఇంటర్మీడియట్​ బోర్డు నుంచి ఎంపీసీ స్టూడెంట్​కు రూ.16, బైపీసీ స్టూడెంట్​కు రూ.24 చొప్పున మంజూరు అయ్యాయి. అన్ని కాలేజీల్లో సరిపడా ఎక్విప్​మెంట్​, కెమికల్స్​ అందుబాటులో ఉన్నాయి. ఇవి లేని చోట్ల తెచ్చుకోవాలని ప్రిన్సిపాల్స్​కు చెప్పాం. 
వెంకటేశ్వర్లు, డీఐఈవో, మహబూబ్​నగర్​