భారతరత్న అందుకున్న ప్రణబ్ ముఖర్జీ

భారతరత్న అందుకున్న ప్రణబ్ ముఖర్జీ

ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2019 ఏడాదికి గాను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దివంగత సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ ముఖ్‌, దివంగత దర్శక నిర్మాత, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాకుదేశ అత్యున్నత పురస్కారం ప్రకటించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న తర్వాత ప్రణబ్‌ ముఖర్జీకి పలువురు నేతలు అభినందనలు తెలిపారు.