ప్రసాద్ ల్యాబ్స్ చైర్మన్ కు సతీ వియోగం

ప్రసాద్ ల్యాబ్స్ చైర్మన్ కు సతీ వియోగం

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ భార్య  విజయలక్ష్మి మరణించారు. హార్ట్ ఎటాక్ కారణంగా బుధవారం రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం ఎంతసేపటికీ నిద్ర లేవకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె గదిలోకి వెళ్లి చూడగా.. ప్రాణాలు వదిలినట్లు గుర్తించారు.

విజయలక్షి వయసు 77 సంవత్సరాలు. ఆమె మద్రాసులో జన్మించారు. రమేష్ ప్రసాద్ తో 1963 జూలైలో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.  విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.