ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి

ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌లో రాష్ట్రపతి ముర్ము మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పసుపు రంగు చీర, మస్టర్డ్ కలర్ స్వెటర్ ధరించి కనిపించారు. రాష్ట్రపతి ముర్ము మెట్రో రైల్లోని సీటుపై కూర్చుని విద్యార్థులతో నవ్వుతూ మాట్లాడటం కనిపిస్తుంది. ముర్ము ముందు సీట్లో మరో వ్యక్తి కూర్చుని ఆమె ఫోటో తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. 

ALSO READ :- హైదరాబాద్లో ఏఐ సమ్మిట్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తన సెక్యూరిటీ గార్డులతో కలిసి ఈ వీడియోలో కనిపించారు. మెట్రో నిర్వహణ, కార్యకలాపాలపై డీఎంఆర్‌సీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఢిల్లీ ప్రజల రోజువారీ అనుభవాలను తెలుసుకునేందుకు రాష్ట్రపతి ముర్ము ఈ మేరకు మెట్రోలో ప్రయాణించారని తెలుస్తోంది.