
హైదరాబాద్సిటీ, వెలుగు: ప్రైడ్ఆఫ్తెలంగాణ అవార్డ్స్–2025 సంబంధించి 6వ ఎడిషన్ను రౌండ్టేబుల్ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. హైటెక్సిటీలోని హైటెక్స్లో ఉన్న నోవాటెల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని గర్వపడేలా చేసిన అత్యుత్తమ వ్యక్తులను, ప్రతిభావంతులను సత్కరించి అవార్డులను అందజేశారు.
ట్రిబ్యూట్, ఎచీవర్స్, స్పెషల్ జ్యూరీ అవార్డీ, ఎమర్జింగ్ టాలెంట్ కేటరీల్లో అందజేశారు. డార్విన్బాక్స్సంస్థ ఎచీవర్, వైడర్ఎమెర్జింగ్టాలెంట్సంస్థలు స్టార్టప్ కేటగిరీలో అవార్డులను అందుకున్నాయి. ఈ కార్యక్రమం టేబుల్చైర్మన్ సిద్ధార్ధ జి, కన్వీనర్ నీషన్ గుప్తా ఆధ్యర్యంలో నిర్వహించారు.
శివాంశ్స్కూల్ఆఫ్ఆర్ట్స్ద్వారా క్లాసికల్ప్యూజన్ ప్రదర్శక అందరినీ ఆకట్టుకుంది. ఒగ్గు రాజశేఖర్ బృందం ఒగ్గుడోలు ప్రదర్శనతో సందడి చేశారు. బాలీవుడ్ మేడ్లీ భూమిక తివారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంత్ రిసా సౌండ్ ఆర్ట్ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.