నల్గొండ అర్బన్, వెలుగు : చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ గురువారం నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేట్హాస్పిటల్ ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట సమీప గ్రామానికి చెందిన నరేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో బుధవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి హైదరాబాద్ కు రెఫర్ చేశారు. అయితే పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అప్పటికే నరేశ్ చనిపోయినప్పటికీ చెప్పకుండా హాస్పిటల్లో చేర్చుకుని వైద్యం చేసినట్లు నటించి డబ్బులు వసూలు చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీనిపై ఆసుపత్రి డాక్టర్శశాంక్ మాట్లాడుతూ తల, ఛాతిపై తీవ్ర గాయాలతో ఉన్న నరేశ్ను బుధవారం హాస్పిటల్కు తీసుకొచ్చారని, 99 శాతం బతకడం కష్టమేనని చెప్పినప్పటికీ వారు వినలేదన్నారు. గురువారం మళ్లీ వారి బంధువులను పిలిచి బతకడం కష్టమేనని చెప్పామని తెలిపారు. వారు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుపోయే లోపు చనిపోయాడని చెప్పారు. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్
చేశామని చెప్పడంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.