పాలమూరు యూనివర్సిటీలో సమస్యలు

పాలమూరు యూనివర్సిటీలో సమస్యలు

మహబూబ్​నగర్/మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు:పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో సమస్యలు తిష్ట వేశాయి. క్యాంపస్​లో స్ట్రీట్​ లైట్లు నెలలుగా వెలుగకపోయినా ఫండ్స్​ లేక రిపేర్లు చేయించడం లేదు. హాస్టల్​లో ఫుడ్​ క్వాలిటీగా లేదని వారం కిందట స్టూడెంట్లు ఆందోళన చేయగా, రెండు రోజుల కింద లైబ్రెరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అయ్యేందుకు కాంపిటేటివ్​ బుక్స్​ లేవని కంప్యూటర్లు బయట పెట్టి నిరసన తెలిపారు.

ఐదేళ్ల కిందటి పుస్తకాలే దిక్కు..

యూనివర్సిటీలో 200 మంది కూర్చొని చదువుకునేలా లైబ్రరీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వర్సిటీలో 1,000 మంది స్టూడెంట్లు ఉండగా, వీరికి అనుగుణంగా లైబ్రెరీని డెవలప్​ చేయలేదు. కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన అకడమిక్​ పుస్తకాలు కూడా లేవు. 2018కి సంబంధించిన కాంపిటేటివ్​ పుస్తకాలే ఉన్నాయి. ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుండడంతో లైబ్రెరీలో చదువుకునేందుకు స్టూడెంట్లు క్యూ కడుతున్నారు. కొత్త పుస్తకాలు తెప్పించకపోవడంపై స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్త బుక్స్​ తెప్పిస్తామని వర్సిటీ వీసీ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీనికితోడు లైబ్రరీ వద్ద ఉన్న టాయిలెట్స్​నుంచి వాసన వస్తోందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కంప్యూటర్లు పనిచేయవ్..

వర్సిటీ లైబ్రరీలో కంప్యూటర్లు షో పుటప్​​గా మారాయి. 24 కంప్యూటర్లలో రెండే పని​చేస్తున్నాయి. మిగతావి పాతవి కావడంతో పని చేయడం లేదు. ఈ కంప్యూటర్లకు ఇంటర్నెట్​ ఫెసిలిటీ ఉన్నా, వాడడం లేదు. ఇటీవల స్టూడెంట్లు ఆందోళన చేయడంతో పది కొత్త కంప్యూటర్లు తెచ్చి పెట్టారు. కానీ, వాటిని ఇప్పటికీ ఇన్​స్టాల్​​చేయలేదు. అయితే, స్టూడెంట్లు ఆందోళన చేసిన ప్రతిసారి వర్సిటీ సిబ్బంది కొత్త కంప్యూటర్లు తెచ్చి పెట్టి, ఆ తరువాత వాటిని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు.

కరెంట్​ ప్రాబ్లమ్..​

వర్సిటీలో కరెంట్​ ప్రాబ్లమ్  వస్తోంది. మెయిన్​ గేట్​ నుంచి ఉన్న స్ట్రీట్​ లైట్లు పని చేయడం లేదు. నెలలు కావస్తున్నా, ఇంత వరకు బల్బులు రీ ప్లేస్​ చేయడం లేదు. హాస్టల్స్​లోని కొన్ని రూమ్స్​లో ఫ్యాన్లు పని చేయడం లేదు. ట్యూబ్​ లైట్లు వెలగడం లేదు. రాత్రి లైబ్రరీ నుంచి హాస్టల్​కు రావడానికి స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పాములు, కొండచిలువలు కనిపించడంతో భయపడుతున్నారు.

ఫుడ్​ స్మెల్​ వస్తోంది..

కొద్ది రోజులుగా వర్సిటీలో భోజనం సరిగ్గా పెట్టడం లేదని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. వారం రోజుల కింద స్టూడెంట్లు పీయూ మెయిన్​ గేట్​ వద్ద బైఠాయించారు. అన్నం వాసన వస్తోందని, కూరలు రుచిగా ఉండడం లేదని, కడుపు నిండా తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులను మార్చాలని డిమాండ్​ చేశారు. స్పందించిన పీయూ అధికారులు ఏజెన్సీ నిర్వాహకులను మారుస్తామని హామీ ఇచ్చారు.

ఇన్​స్టాలేషన్​ ఎప్పుడు చేస్తరో తెల్వదు..

లైబ్రరీలో 24 కంప్యూటర్లు ఉన్నాయి. అందులో రెండే పని చేస్తున్నాయి. కొత్త కంప్యూటర్లు తెప్పించాలని చాలా సార్లు ధర్నాలు చేసినం. నాలుగు రోజుల కింద ధర్నా చేస్తే, కొత్తగా పది కంప్యూటర్లు తెచ్చి పెట్టింన్రు. కానీ ఇన్​స్టాలేషన్​ చేయలేదు.
- నరేశ్  తేజ్, ఎంబీఏ సెకండ్​ ఇయర్

కొత్త పుస్తకాలు తెప్పించాలె..

లైబ్రరీలో అకడమిక్​కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు లేవు. కాంపిటేటివ్ పుస్తకాలదీ అదే పరిస్థితి. 2018కి చెందిన కాంపిటేటివ్​ బుక్స్​ మాత్రమే ఉన్నాయి. వెంటనే కొత్త పుస్తకాలను తెప్పించాలె. 
- మారుతి, ఎంఏ ఎకనామిక్స్​ సెకండ్​ ఇయర్

త్వరలో పరిష్కరిస్తాం..

లైబ్రరీ వద్ద ఉన్న టాయిలెట్స్​ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. స్ట్రీట్​ లైట్ల బల్పులు మార్చాలని మున్సిపాలిటీ వాళ్లకు చాలా సార్లు చెప్పాం. భోజనంలో ఎలాంటి సమస్య లేదు. అయినా, కొత్త వారికి కాంట్రాక్ట్​ అప్పగిస్తున్నాం.
- లక్ష్మీకాంత్​ రాథోడ్​, వైస్​ చాన్స్​లర్