
లింగంపేట,వెలుగు: మాల్తుమ్మెద ఏరువాక కేంద్రం సైంటిస్ట్ రేవంత్ నాథన్ శనివారం మండలంలోని మెంగారంలో రైతు గొల్ల బాలయ్య యాదవ్ సాగుచేస్తున్న వరి పంటను పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు కొత్తగా రూపొందించిన డబ్ల్యూజీఎల్1537, ఆర్డీఆర్1162, కేపీఎస్6251 రకాల వరి సాగు గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. కొత్త రకం విత్తనాలతో సాగుచేసిన వరి పైర్లు ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉండడం పట్ల సైంటిస్ట్ సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నాగరాజు, లక్ష్మీనారాయణ, సత్యాగౌడ్, బాలసాయిలు, ప్రమీల, తోట సత్యవ్వ, కుమ్మరి సాయిలు ఉన్నారు.