- కాంగ్రెస్లో చేరిన వరంగల్తూర్పు బీఆర్ఎస్ కార్పొరేటర్లు
కాశీబుగ్గ, వెలుగు: గ్రేటర్వరంగల్పై కాంగ్రెస్ పూర్థి స్థాయిలో పట్టు సాధించిందని ఆటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ (తూర్పు) మైనార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆయూబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 11మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు12 డివిజన్ల అధ్యక్షులు చేరారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గ్రేటర్వరంగల్ అంతా కాంగ్రెస్మయమైందని, చేరిన వారందరినీ పార్టీ కంటికి రెప్పలా పాడుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే వరంగల్తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్పొరేటర్లు బోరబోయిన ఉమా, కావటి కవిత, వస్కుల బాబు, ఓని స్వర్ణలత, భాస్కర్, బస్వరాజు కుమార్, ఆకుతోట తేజస్విని శిరీష, చింతాకుల అనిల్, ముష్కమల్ల అరుణ, పోశాల పద్మ, సురేశ్ జోషి, మాజీ కార్పొరేటర్లు దామోదర్ యాదవ్, జారతి రమేశ్, కల్పన, రజిత, గౌడ్ సొసైటీ చైర్మన్ శ్యామ్, తోట హరీశ్ చేరారు. తర్వాత క్యాంప్ఆఫీసుకు వెళ్లి సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. కార్పొరేటర్ గుండేటి నరేందర్, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.