ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌లో ఫైనల్లో పుణె, హర్యానా

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌లో ఫైనల్లో పుణె, హర్యానా

హైదరాబాద్‌‌‌‌: ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ (పీకేఎల్‌‌‌‌)లో పుణెరి పల్టాన్‌‌‌‌, హర్యానా స్టీలర్స్‌‌‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి సెమీస్‌‌‌‌లో పుణె 37–21తో మూడుసార్లు చాంపియన్‌‌‌‌ పట్నా పైరేట్స్‌‌‌‌పై నెగ్గింది. కెప్టెన్‌‌‌‌ అస్లమ్‌‌‌‌ ఇనామ్‌‌‌‌దార్‌‌‌‌ (7) ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్నాడు. పంకజ్‌‌‌‌ మోహిత్‌‌‌‌ (7), మహ్మద్‌‌‌‌ రెజా (5), మోహిత్‌‌‌‌ గోయట్‌‌‌‌ (4) అండగా నిలిచారు. ఆరంభం నుంచి ఇరుజట్లు రైడింగ్‌‌‌‌లో హోరాహోరీగా తలపడ్డాయి. 

ఒక్కో పాయింట్‌‌‌‌తో ముందుకెళ్లాయి. పట్నా టీమ్‌‌‌‌లో సచిన్‌‌‌‌ (5), మంజీత్‌‌‌‌ (4), సుధాకర్‌‌‌‌ (4), క్రిషన్‌‌‌‌ (2) పోరాడి విఫలమయ్యారు. మరో మ్యాచ్‌‌‌‌లో హర్యానా స్టీలర్స్‌‌‌‌ 31–27తో జైపూర్‌‌‌‌ పింక్‌‌‌‌ పాంథర్స్‌‌‌‌ను ఓడించి టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు అర్హత సాధించింది. హర్యానా ప్లేయర్లు వినయ్‌‌‌‌ (11), శివమ్‌‌‌‌ (7) రైడింగ్‌‌‌‌లో ఆకట్టుకున్నారు. ఆశిష్‌‌‌‌ (4) ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా రాణించాడు. జైపూర్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ దేశ్వాల్‌‌‌‌ 14 పాయింట్లు సాధించినా ప్రయోజనం దక్కలేదు. రెజా (4), భవానీ రాజ్‌‌‌‌పుత్‌‌‌‌ (3) ఫెయిలయ్యారు. శుక్రవారం పుణె, హర్యానా మధ్య ఫైనల్‌‌‌‌ ఫైట్‌‌‌‌ జరగనుంది.