హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ఫైనల్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే టైటిల్ ఫైట్లో పుణెరి పల్టాన్.. హర్యానా స్టీలర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పుణె గత సీజన్ ఫామ్ను కొనసాగించి రెండోసారి ఫైనల్కు చేరుకోగా, హర్యానా తొలిసారి కప్ కోసం రెడీ అయ్యింది. పుణెరి టీమ్లో కెప్టెన్ అస్లామ్ ఫామ్లో ఉండగా, స్టార్ డిఫెండర్ మహ్మద్ రెజా, శాడ్లోయ్ చియానె, మోహిత్ గోయత్, పంకజ్ మోహిత్ కూడా సమష్టి పెర్ఫామెన్స్తో రాణిస్తున్నారు.
మరోవైపు లీగ్ దశలో అద్భుత విజయాలు సాధించిన హర్యానాను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మూడుసార్లు ఫైనలిస్ట్ మన్ప్రీత్ సింగ్ శిక్షణలో, జైదీప్ సింగ్ కెప్టెన్సీలో యువ ప్లేయర్లు టైటిల్ కోసం తహతహలాడుతున్నారు. సెమీస్లో జైపూర్ను ఓడించడం ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ను పెంచింది.